కల్కీ 2898 AD – 2 పార్ట్స్ ఆలోచన ఎవరిదంటే?

ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాకు ఇటీవల కల్కి 2898 AD అనే టైటిల్ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ కేవలం ఒక భాగంతోనే పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆ తర్వాత రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు కారణం నిర్మాత అశ్విని దత్.

ఎందుకంటే సినిమా కథ అనుకున్నప్పుడు బడ్జెట్ కేవలం 250 కోట్లు మాత్రమే. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అంచనాలు మారిపోయాయి. బౌండెడ్ స్క్రిప్ట్ లో సిద్ధమైన తర్వాత బడ్జెట్ లెక్కలు 400 కోట్లు దాటాయి. ఇక ఆ తర్వాత క్యాస్టింగ్ విషయంలో మరింత అంచనాలు పెరగడంతో లెక్క 500 కోట్లకు చేరింది.

ఇక నిర్మాత అశ్వినిదత్ ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ స్థాయిలో బడ్జెట్ అయితే పెట్టలేదు. ఇక ప్రభాస్ ను నమ్ముకుని దర్శకుడు నాగ్ అశ్విన్ సక్సెస్ పై కూడా అశ్వినీదత్ నమ్మకం పెట్టుకుని 500 కోట్లు అయినా పెట్టడానికి వెనుకడుగు వేయలేదు. కానీ ఆ తర్వాత సినిమా రన్ టైం కూడా చాలా పెరిగిపోయింది.

పెట్టిన పెట్టుబడికి అసలు ఎడిట్ లో పోతున్న దానికి చాలా వ్యత్యాసం ఉండడంతో నిర్మాత అశ్వినీ దత్ మళ్ళీ దర్శకుడితో మాట్లాడి ఒక బలమైన కండిషన్ అయితే పెట్టారు. సినిమాను రెండు భాగాలుగా తీసుకురావాలి అని చెప్పడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ మళ్లీ కథలో కొన్ని మార్పులు కూడా చేయాల్సి వచ్చింది. ఆ విధంగా కల్కి సినిమా రెండు భాగాలుగా రావడానికి నిర్మాత కారణమయ్యారు..