5 రోజుల లెక్కలేవి అంబటి “బ్రో”??

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లు అయితే టాలీవుడ్ లో మరే హీరో కూడా ఎదుర్కోవట్లేదు అని చెప్పాలి. ఓ పక్క రాజకీయాలు మరో పక్క సినిమాలు చేస్తూ రెండిట్లో కూడా పొలిటికల్ గా పవన్ మెయిన్ టార్గెట్ గా మారగా పవన్ నటించిన రీసెంట్ అన్ని చిత్రాలు కూడా ఇపుడు పొలిటికల్ రంగుని పులుముకున్నాయి.

ఇక అలా పవన్ లేటెస్ట్ గా చేసిన “బ్రో” చిత్రాన్ని అలాగే సినిమా రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కూడా ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేస్తూ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ దుమారం రేపింది. పైగా బ్రో చిత్రం నాలుగు రోజుల్లో ఏకంగా 55 కోట్ల షేర్ ని రాబట్టింది అని ఏరియాల వారీగా నా దగ్గర లెక్కలు ఉన్నాయని తాను చెప్పడం జరిగింది.

ఇక సినిమా వచ్చి 5 రోజులు కంప్లీట్ కావడంతో సోషల్ మీడియాలో మంత్రి అంబటిని నెటిజన్స్ ట్యాగ్ చేసి మరీ మాకు “బ్రో” 5 రోజుల వసూళ్ల వివరాలు కావాలి అని అడుగుతున్నారు. మీరు మీ శాఖ పనులు చేయకుండా వసూళ్ల కోసం క్లారిటీగా భలే చెప్తున్నారు అని బ్రో లేటెస్ట్ వసూళ్లు ఎంత వచ్చాయి వివరాలు కావాలి అని వారు అంటున్నారు.

మొత్తానికి అయితే ఏపీలో పాలిటిక్స్ పొలిటిషన్స్ సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు అని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.