జైలు నుంచి బయటకి వచ్చిన తరవాత ప్రభాస్ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా ..?

జైలు నుంచి బయటకి వచ్చాక చాలా మందికి జనాలలో కలవాలని ఆసక్తి ఉండదు. ఈ విషయం లో సినీ తారలకి ఇంకా ఎక్కువగా ఇబ్బంది గా అనిపిస్తుంటుంది. అందుకు కారణం సినిమా సెలబ్రిటీస్ కాబట్టి ప్రతీ ఒక్కరు రక రకాల ప్రశ్నలు వేసి ఆరాలు తీస్తుంటారు. ఆ ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మొహం చాటేసుకొని తిరుగుతుంటారు. రీసెంట్ గా ఇలానే ఒక సినీ తార జైలు నుంచి బయటకి వచ్చింది. ఆమె ఎవరో కాదు డార్లింగ్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన గల్రానీ.

Sandalwood drug case Archives - TheNewsMantra

ఆ మధ్య శాండిల్ వుడ్ డ్రగ్స్ రాకెట్ లో హీరోయిన్ సంజన గల్రానీ ని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సంజన గల్రానీని టాలీవుడ్ హీరోయిన్ అని కూడా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అందుకు కారణం ప్రభాస్ బుజ్జిగాడు సినిమా తర్వాత తెలుగులో ‘యమహా యమా’ ‘ముగ్గురు’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి సినిమాలలో నటించడమే. కాగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సంజన మీద రక రకాల ఆరోపణలు వచ్చాయి. అక్రమాస్తులు ఉన్నాయని.. డ్రగ్ దందాతో పాటు క్రికెట్ బెట్టింగ్స్ కూడా నిర్వహించేదని.. ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి.

అయితే ఎట్టకేలకి సంజన గత ఏడాది డిసెంబర్ 13న బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చింది. ఇలా సంజన జైలు నుంచి బయటకు వచ్చిందో లేదో సన్నిహితుల దగ్గర చాలా ఎమోషనల్ అయ్యిందట. కావాలనే నన్ను ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇరికించారని.. నన్ను టార్గెట్ చేసే ఇలా జైలు పాలు చేశారని వాపోయిందని చెప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఆ మూడ్ నుంచి బయట పడి మళ్ళీ సినిమాలలో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోందట. అయితే సంజన లాక్ డౌన్ కంటే ముందే కొన్ని సినిమాలకు సైన్ చేసిందట. వాటిలో ఒక తమిళ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతోందని సమాచారం.