Shruthi Hassan: శృతిహాసన్‌కి ఏమైంది? తీవ్ర విచారం వ్యక్తం చేసిన బాలయ్య.. అసలేమైందంటే…

Shruthi Hassan: కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందన్న వార్తలు ఊరటనిస్తున్నా.. అడపాదడపా ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. కాగా అందులో ముఖ్యంగా చాలా మంచి పాపులర్ సినీ సెలబ్రిటీలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లోనూ కరోనా వైరస్‌ మరికొందరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడిప్పుడే కరోనా అంతమైపోతుందని సంతోషిస్తున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు తాము కరోనా బారిన పడినట్టు చేసిన పోస్టులను చూస్తుంటే ఆ టైన్షన్ మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళితే ఇటీవలే తాను కరోనా బారిన పడ్డట్టు ప్రకటించిన హీరోయిన్ శృతి హాసన్, ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కరోనాతో చాలా నీరసించి పోయాను.. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ ఆమె చేసిన ఆ ఫొటోని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత నీరసించి పోయారో. అది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేశారు.

అయితే శృతి హాసన్ ఆరోగ్యంపై తాజాగా నటుడు బాలకృష్ణ స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనే స్వయంగా ఫోన్ చేసి, ఆమె ఆరోగ్యంపై ఆరా తీసి, బాగోగుల గురించి కనుకున్నారని, త్వరగా కోలుకుంటావు తల్లీ అని ధైర్యం కూడా చెప్పినట్టు సమాచారం. అంతే కాకుండా తనకు ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని, తామంతా అండగా నిలుస్తామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. బయట చాలా మంది చెప్పుకుంటున్నట్టు బాలయ్య కఠినంగా కనిపించినా, ఆయన మనస్సు ఎంతో మంచిదని ఈ విషయం ద్వారా మరోసారి అవగతమవుతోంది. ఇకపోతే బాలకృష్ణ శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.