ఆ ఒక్క కారణంతోనే రహస్యంగా పెళ్లి చేసుకున్నాం.. కత్రినా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ నటుడు విక్కీ కౌశల్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమించుకుని గత ఏడాది డిసెంబర్ నెలలో రాజస్థాన్లోని ఓ ప్రముఖ కోటలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరి వివాహం అనంతరం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట వృత్తి పరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ జంట ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసినప్పటికీ వీరు పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన ఈ పెళ్లిపై వీరిద్దరూ ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇలా పెళ్లి గురించి అధికారక ప్రకటనచేయకుండా ఉండటమే కాకుండా వివాహం అయ్యే అంతవరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి చిన్న ఫోటో లేదా వీడియోలను కూడా బయటకు విడుదల చేయలేదు.వీరి వివాహం పూర్తి అయిన తర్వాత ఈ జంట తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఇలా ఎవరికీ ఏమీ చెప్పకుండా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అప్పట్లో చాలా మంది సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై నటి కత్రినా కైఫ్ స్పందించారు.

తాజాగా జరిగిన ఫిలింఫేర్ ఫెస్టివల్ లో భాగంగా విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి హాజరైన కత్రినా కైఫ్ తమ పెళ్లి రహస్యంగా జరగడానికి కారణం కరోనా మాత్రమేనని సమాధానం చెప్పారు.మా పెళ్లి సమయంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మా పెళ్లిని రహస్యంగా చేసుకోవాల్సి వచ్చిందని ఈమె వెల్లడించారు. అప్పటికే తమ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడ్డారని మా వల్ల ఇంకా పలువురు ఈ బాధను అనుభవించకూడదన్న ఉద్దేశంతోనే తమ పెళ్లిని చాలా రహస్యంగా చేసుకున్నామని ఈ సందర్భంగా కత్రినా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.