మొదటి వారానికి “విరూపాక్ష” వరల్డ్ వైడ్ అదిరే వసూళ్లు.!

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ డ్రామా “విరూపాక్ష” రిలీజ్ అయ్యి నేటితో అయితే మొదటి వారం రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది. కాగా మొదటి రోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతూ అంతకు మించిన గట్టి హోల్డ్ కనబరుస్తూ వచ్చిన ఈ సినిమా..

సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సెన్సేషనల్ రన్ అయితే వరల్డ్ వైడ్ గా 7 రోజులు కంప్లీట్ చేసుకోగా ఈ  7 రోజుల్లో ఐతే ఈ చిత్రం 62.5 కోట్ల భారీ గ్రాస్ ని రాబట్టినట్టుగా మేకర్స్ తెలిపారు. దీనితో అయితే ఈ సినిమా రెండో వారాంతంలో డెఫినెట్ గా 70 కోట్ల మార్క్ కి చేరుకుంటుంది అని చెప్పొచ్చు.

ఇక ఏపీ తెలంగాణలో కూడా ఈ చిత్రం 7 రోజుల్లో 25 కోట్లకి పైగా షేర్ ని రాబట్టగా 50 కోట్లకి పైగా గ్రాస్ ని ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే రాబట్టింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా 1 మిలియన్ మార్క్ ని అందుకోగా అక్కడ కూడా మంచి హోల్డ్ తో దూసుకెళ్తుంది అని ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేశారు.

మొత్తానికి అయితే విరూపాక్ష హవా మాములు స్థాయిలో లేదని చెప్పి తీరాలి. ఇక ఈ సినిమాకి యంగ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించగా, రాజీవ్ కనకాల, సునీల్ తదితర నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించారు.