లేటెస్ట్ : రికార్డ్ మార్క్ కొట్టేసిన “విరూపాక్ష” వసూళ్లు.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర భారీ హిట్ అయ్యిన కొద్ది చిత్రాల్లో మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కార్తీక్ దండు తో చేసిన ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” కోసం తెలిసిందే. అయితే సాయి ధరమ్ తేజ్ కి పెను ప్రమాదం తర్వాత తాను చాలా కష్టపడి చేసిన సినిమా ఇది కాగా దీనికి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రిజల్ట్ దక్కింది.

అంతే కాకుండా భారీ లాభాలు అందించిన సినిమాగా కూడా ఇదే నిలవగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక డెఫినెట్ గా చాలా మంది 100 కోట్ల వసూళ్ల మార్క్ లో చేరుతుంది అని అంతా అనుకున్నారు. అయితే ఈ చిత్రం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ రికార్డు మార్క్ ని కొట్టేసింది.

టైర్ 2 హీరోస్ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఇప్పుడు 100 కోట్ల మార్క్ ఉన్న హీరోగా నిలిచాడు. కాగా ఈ చిత్రంని దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరో డామినేటింగ్ పాత్ర అయితే ఈ సినిమాలో చేసింది.

ఇక ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లో సునీల్, రాజీవ్ కనకాల తదితరులు నటించగా కాంతారా మ్యూజిక్ దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా దర్శకుడు సుకుమార్ అయితే ఈ చిత్రానికి పలు కీలక మార్పులు మరియు స్క్రీన్ ప్లే ని అందించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా రిజల్ట్ తో అయితే సాయి ధరమ్ తేజ్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.