బాక్సాఫీస్ : తెలుగు స్టేట్స్ లో “విరూపాక్ష” 5 రోజుల వసూళ్లు.!

టాలీవుడ్ లేటెస్ట్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ సినిమా “విరూపాక్ష” కోసం తెలిసిందే. దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన ఈ చిత్రంలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో అదిరే వసూళ్లు రాబడుతూ భారీ లాభాలు అందించే దిశగా అయితే దూసుకెళ్తుంది. కాగా మొన్న సోమవారం కూడా ఈ చిత్రం 3 కోట్ల మేర షేర్ ని రాబట్టి కేవలం తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల మేర షేర్ ని టచ్ చేయగా ఈ 5వ రోజు మంగళవారం అయితే స్వల్ప డ్రాప్ తో 2.4 కోట్ల షేర్ ని రాబట్టిందట.

దీనితో ఈ చిత్రం మొత్తం 5 రోజుల్లో 22.5 కోట్ల షేర్ ని టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. దీనితో విరూపాక్ష మాత్రం అదిరే వసూళ్లు రాబడుతుంది అని చెప్పాలి. అలాగే ఇది మరింత స్థాయిలో కొనసాగేలా ఉందని కూడా చెప్పొచ్చు. మరి ఏజెంట్ వచ్చి ఏమన్నా బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.

ఇక ఈ చిత్రానికి అయితే కాంతారా, విక్రాంత్ రోనా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. ఆలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించగా అతి త్వరలోనే సీక్వెల్ పనులు కూడా మేకర్స్ స్టార్ట్ చేయనున్నట్టు సాయి తేజ్ కన్ఫర్మ్ చేసాడు. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కూడా కన్ఫర్మ్ గా ఉంటుంది అని తెలిపాడు.