బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “విరూపాక్ష” 4 డేస్ వసూళ్లు.!

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ హీరోగా లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన సినిమా “విరూపాక్ష” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ ని తెచ్చుకోగా భారీ హిట్ అయ్యింది.

కాగా ఈ సినిమా మొదటి రోజుతో పోలిస్తే మిగతా రెండు రోజుల వసూళ్లు కూడా అదరగొట్టింది. అయితే ఇపుడు సక్సెస్ ఫుల్ గా వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సోమవారం కూడా అదిరే వసూళ్లు రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

ఇక మేకర్స్ అయితే ఈ సినిమా మూడు రోజుల్లో రికార్డు మొత్తంలో 50 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి అదరగొట్టింది. అలాగే యూఎస్ లో మార్కెట్ లో కూడా ఈ చిత్ర 8 లక్షల డాలర్స్ వైపుగా దూసుకెళ్తుంది. దీనితో అయితే వరల్డ్ వైడ్ గా 25 కోట్ల షేర్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఇక నుంచి ఈ సినిమా లాభాలు బాట లో నడుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా ఫైనల్ రన్ లో 70 కోట్లకి పైగా వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. అంతే కాకుండా మరికొన్ని రోజుల్లో అయితే మిగతా ఇతర భాషల్లో రిలీజ్ కాబోతున్నట్టుగా సాయి ధరమ్ తేజ్ కన్ఫర్మ్ చేసాడు. ఇంకా ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ దండు వర్క్ చేయగా స్టార్ దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే మరియు పలు ట్విస్ట్ లు అయితే యాడ్ చేసాడు.