ఏపీ/తెలంగాణాలో “విరూపాక్ష” 4 రోజుల వసూళ్లు డీటెయిల్స్.!

లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ సినిమా “విరూపాక్ష” పేరే ఇపుడు బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది. దీనితో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా మొదటి వారాంతంలో సక్సెస్ ఫుల్ గా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ 20 కోట్లకి పైగా షేర్ ని రాబట్టగా..

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల రన్ ని అయితే కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ సినిమా కీలకమైన సోమవారం టెస్ట్ ని కూడా సింపుల్ గా పాస్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏపీ తెలంగాణలో అయితే అయితే వర్కింగ్ డే సోమవారం 3 కోట్ల మేర షేర్ ని రాబట్టిందట.

దీనితో ఈ నాలుగు రోజుల్లో విరూపాక్ష తెలుగు స్టేట్స్ లో 20 కోట్ల మేర షేర్ ని టచ్ చేసేసి ప్రాఫిట్స్ జోన్ లోకి అయితే అడుగు పెట్టేసింది. ఇక ఈ మంగళవారం నుంచి సినిమా వసూళ్లు మరింత స్థాయిలో పెరగనున్నాయని కూడా చెప్పాలి. మొత్తానికి అయితే తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష గట్టెక్కేసింది అని చెప్పొచ్చు.

ఇంకా ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. అలాగే సుకుమార్ స్క్రీన్ ప్లే అందించగా సునీల్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే మేకర్స్ త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తుండగా దర్శకుడు సినిమా స్క్రిప్ట్ ని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది.