లేటెస్ట్ : “విరూపాక్ష” వరల్డ్ వైడ్ 3 రోజుల వసూళ్లు ఎంతంటే.!

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “విరూపాక్ష” ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. చిత్ర యూనిట్ అంతా కూడా గట్టి నమ్మకం పెట్టుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ నుంచి కేవలం తెలుగు రిలీజ్ మాత్రమే అయ్యింది.

అయితే తెలుగు వెర్షన్ లోనే రిలీజ్ అయ్యినప్పటికీ ఈ సినిమా మైండ్ బ్లాకింగ్ వసూళ్లు టైర్ 2 హీరోస్ లో సెట్ చేస్తుంది. మరి మూడు రోజుల్లో ఏపీ తెలంగాణాలో ఆల్ మోస్ట్ టార్గెట్ దగ్గరకి వచ్చేయగా ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

కాగా ఈ సినిమా మూడు రోజుల్లో అయితే 44 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ ని కొనసాగిస్తోంది. అంతే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా సుమారు 8 లక్షల డాలర్స్ మార్క్ దగ్గరకి కూడా వచ్చేసింది. ఇప్పుడు 44 కోట్ల గ్రాస్ కి వచ్చిన ఈ సినిమా సుమారు 23 కోట్ల షేర్ ని రాబట్టినట్టు ట్రేడ్ చెప్తుంది.

దీనితో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 25 కోట్లు వరల్డ్ వైడ్ గా జరగ్గా ఇప్పుడు 97 శాతం మేర వసూళ్లు వచ్చేసాయి. దీనితో ఈ వారం వసూళ్లు అంతా కూడా లాభాలే అని చెప్పాలి. అలాగే ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో కూడా చూడాలి.

ఇంకా ఈ సినిమాలో సంయుక్త మీనన్ సాలిడ్ పాత్రలో కనిపించగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. తనకిది మొదటి సినిమా అయినా కూడా సూపర్బ్ గా సినిమాని హ్యాండిల్ చేసి మెప్పించాడు.