ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై వెట్రిమరాన్ అప్డేట్

ఇటీవల తమిళ్ లో “విడుతలై పార్ట్ 1” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. చిత్ర నటుడు సూరి సమర్పకుడు అల్లు అరవింద్‌తో పాటు, దర్శకుడు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.

ఇక వెట్రి మారన్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌ని కలిశానని, ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పట్టవచ్చని, ఖచ్చితంగా ప్రాజెక్ట్ సెట్ అవుతుందని పేర్కొన్నాడు. ఇక ఎన్టీఆర్ అభిమానులకు ఈ వార్త మంచి కిక్ ఇచ్చింది. అంతేకాకుండా, అల్లు అర్జున్ మహేష్ బాబుతో సహా తెలుగు నటులతో కలిసి పనిచేయడానికి వెట్రి మారన్ సిద్ధంగా ఉన్నారు.

గతంలో చేసిన ప్రయత్నాల గురించి మాట్లాడారు. “ఆడుకాలం” సినిమా విజయం తర్వాత తాను అల్లు అర్జున్‌ని సంప్రదించానని, అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని ఆయన వెల్లడించారు. మహేష్ బాబుని కూడా కలిశాను కానీ కలిసి సినిమా చేయలేదని అన్నారు. అయితే, అతను ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం వల్ల తెలుగు సినిమా కోసం చర్చలు జరుగుతున్నట్లు టాక్ రాగా అది నిజమని తేలిపోయింది.

ఇక ఇంతలో, వెట్రి మారన్ న్యూ ప్రాజెక్ట్ “విడుతలై పార్ట్ 1” తెలుగులో ఏప్రిల్ 15న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. దర్శకుడు ఈ చిత్రం యొక్క సీక్వెల్ షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30లో బిజీగా ఉన్నాడు. మరి వెట్రి మారన్ జూనియర్ ఎన్టీఆర్ ను మళ్ళీ ఎప్పుడు కలుస్తాడో చూడాలి.

Director Vetrimaran About Jr NTR and Allu Arjun Movie | Mahesh Babu | TFPC