Radhey shyam : రాధే శ్యామ్ కోసం మొదట అనుకున్నది ఏ హీరోనో తెలిస్తే షాక్ అవుతారు..!

Radhey Shyam:పాన్ ఇండియా మూవీ గా అభిమానుల ముందుకు రాధేశ్యామ్ వచ్చేసింది.ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా లో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటించడం జరిగింది.సాహో చిత్రం తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధేశ్యాం సినిమా విడుదల అయిన రోజు నుంచి మిశ్రమ స్పందనతో నే ముందుకు వెళుతోంది.

ప్రభాస్ నుంచి ఒక భారీ సినిమాని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు కానీ, దర్శకుడు రాధాకృష్ణ వారిని సంతృప్తి పరచలేక పోయాడు. అయితే ఈ సినిమా గురించి ఒక కొత్త వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమ కథ మొదట విక్టరీ వెంకటేష్ దగ్గరికి వెళ్లినట్లు సమాచారం.రాధే శ్యామ్ ఐడియాను దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి మొదట ఇతర హీరోలకు  వినిపించాడట,ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ తో చర్చలు జరిపారట. అయితే ఆయన అంతగా ఆసక్తి కనబరచలేదు అట.

చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రాధాకృష్ణ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొని, యు.వి.క్రియేషన్స్ తో సంప్రదింపులు జరుపగా వారు ప్రభాస్ తో సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. బాహుబలి సినిమా నాటికే ప్రభాస్ తో సంప్రదింపులు జరపడం ఈ సినిమా ఓకే అయిపోవడం జరిగి పోయిందట. రాధేశ్యామ్ సినిమా మాత్రమే కాదు, తాజాగా శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా మొదట విక్టరీ వెంకటేష్ దగ్గరికి వెళ్లిందట. వెంకటేష్ ఆసక్తి చూపించని రెండు సినిమాలు అభిమానులను పెద్దగా సంతృప్తి పరచలేదు.