హైదరాబాద్‌కు చేరుకున్న నూతన దంపతులు!

వరుణ్‌ తేజ్‌ , లావణ్య త్రిపాఠిలు ఇటలీలో వివాహం చేసుకున్నాక శనివారం హైదరాబాదు చేరుకున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి లకి హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ ఇద్దరితో పాటు మొత్తం మెగా కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాదు చేరుకున్నారు. వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాదు చేరుకున్నారు.

అలాగే అల్లు అర్జున్‌ దంపతులు కూడా ముందుగానే వచ్చేసారు. కాగా మిగిలిన మెగా కుటుంబ సభ్యులు అందరూ శనివారం హైదరాబాదు చేరుకున్నారు. నటుడు నితిన్‌, అతని భార్య కూడా వరుణ్‌ తేజ్‌, లావణ్యల వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే. వాళ్ళు కూడా హైదరాబాదు చేరుకున్నారు. అలాగే చిరంజీవి, నాగబాబు , చిరంజీవి కుమార్తెలు, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, అందరూ హైదరాబాదు చేరుకున్నారు.

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిలు మణికొండలోని వారి స్వగృహానికి చేరుకున్నారు. నవంబర్‌ 5వ తేదీన హైదరాబాదులో పరిశ్రమలోని అతిథిల కోసం రెసెప్షన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రామ్‌ చరణ్‌, ఉపాసన తమ పాపతో హైదరాబాదు చేరుకున్నారు. ఎయిర్‌ పోర్టులో మెగా కుటుంబ సభ్యులు వచ్చిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.