భీమ్లా నాయక్ దర్శకుడి కన్నా అధిక రెమ్యునరేషన్ తీసుకున్న త్రివిక్రమ్.. ఎంతంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు దర్శకత్వం సాగర్ కే చంద్ర వహిస్తుండగా…స్క్రీన్ ప్లే, మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు.పేరుకు మాత్రమే స్క్రీన్ ప్లే మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారని తెలిసినప్పటికీ ఈ సినిమా పూర్తి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు అని సమాచారం.

ఇలా భీమ్లా నాయక్ చిత్రాన్ని ఎంతో బాధ్యతగా తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా అదే స్థాయిలో రెమ్యూనరేషన్ అందుతోందని తెలుస్తోంది.ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సాగర్ కే చంద్ర కన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు సమాచారం.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ చిత్ర నిర్మాతలు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పదహైదు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడంతోపాటు లాభాలలో పర్సెంటేజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పూర్తి స్థాయి చిత్రాన్ని తెరకెక్కించిన స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.