Bheemla Nayak: భీమ్లా నాయక్ స్టేజ్ ఎక్కని త్రివిక్రమ్… కారణం ఏమిటో?

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే జనాలు మామూలుగా ఉండదు అలాంటిది వకీల్ సాబ్ తర్వాత వస్తున్నా యాక్షన్ సినిమా భీమ్లా నాయక్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందులోనూ ఒక పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుపాటి చేయడం అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిబ్రవరి 23న బుధవారం హైదరాబాద్ నడిబొడ్డున యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా జరిపారు.

పవన్ అభిమానుల మధ్య ఈ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు హాజరయ్యారు. ఈ వేడుకలో ఈ సినిమాకు సంబంధించి మరొక ట్రైలర్ ని విడుదల చేసి ప్రేక్షకులకు మంచి బహుమతి ఇచ్చారు.
ఈ వేడుకకు హాజరైన ముఖ్య అతిథులు నటీనటులు అందరూ పవన్ గురించి సినిమా గురించి స్పీచ్ ఇచ్చారు, కానీ పవన్ సినిమాకు సంబంధించిన వేడుక అనగానే గుర్తొచ్చే వ్యక్తులు స్పీచ్ లు ఇద్దరు వే. వారే బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్.

కానీ ఈ వేడుకలో ఇద్దరి స్పీచ్ లేక కొద్దిగా కళ తప్పిన అని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ గురించి. ఎందుకంటే త్రివిక్రమ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ దగ్గరుండి చూసుకుంటారు అనే మొదటి నుంచే వార్తలు వినిపించాయి. మేకింగ్ వీడియో స్టిల్ లో కూడా చూశాం.

ఈ విధంగా ఈ సినిమా విషయంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వేడుకకు హాజరయ్యారు కానీ వేదిక పైకి రాలేదు. మొదటి నుంచి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన త్రివిక్రమ్ శ్రీనివాస్ వేదికపైకి రాకపోవడం మాట్లాడకపోవడం అందరినీ షాక్ గురి చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వేదిక పైకి రాకపోవడానికి అసలు కారణం ఏంటో తెలియాలి మరి… !