ఒక్కరోజులోనే ఓటింగ్ తో మళ్లీ టాప్ లో టైటిల్ ఫేవరెట్ కంటెస్టెంట్..?

బిగ్ బాస్ షో తెలుగు బాషతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ఇతర భాషల్లో కూడా ప్రసారం అవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం ఊహించని విధంగా మంచి స్పందన దక్కించుకుంటోంది. అంతేకాకుండా ఏ భాషలో కూడా రాని టిఆర్పి రేటింగ్ సంపాదించుకుంటోంది. సీజన్ సీజన్ కి మరింత ఎక్కువగా ప్రేక్షకాదరణను పెంచుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్ లు విజయవంతంగా పూర్తి అయిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో అంటూ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షో కూడా మొదట్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ రాను రాను ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ లతో ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. ఈ బిగ్ బాస్ బాస్ నాన్ స్టాప్ షో మొదట 17 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైంది. ఇప్పటికే హౌస్ నుంచి తొమ్మిది మంది కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. చూస్తుండగానే అప్పుడే బిగ్ బాస్ షో పదో వారానికి చేరుకుంది.

ఇప్పటికే ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్, హమీదాలు షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక పదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారు అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పదవ వారంలో బలమైన కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. టైటిల్ ఫేవరెట్ గా ఉన్న బిందుమాధవి పై నెగిటివ్ ప్రచారం ఏర్పడడంతో మొదటి రెండు రోజుల్లో ఆమెకు ఓటింగ్ చాలావరకు తగ్గిపోయింది. దీంతో టాప్ వన్ ప్లేస్ లోకి అఖిల్ చేరుకున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బిందు మాధవికి ఒక్కరోజులోనే ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఆ ఒక్క రోజు ఓటింగ్ బిందుమాధవి మళ్లీ టాప్ ప్లేస్ లోకి వెళ్లారు.