ఆయనతో పని చేసిన ఆ క్షణాలు ఎప్పటికీ మధుర జ్ఞాపకమే.. నాగార్జున కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నాగార్జున. ఈయన ప్రస్తుతం ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోని ఈ సినిమాని తమిళంలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే తమిళంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఈ మీడియా సమావేశంలో భాగంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను పుట్టింది చెన్నైలోనేనని అయితే తర్వాత హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. తను చెన్నైకి వచ్చి వెళ్తుంటే పుట్టింటికి వచ్చి వెళుతున్న భావన తనలో కలుగుతుందని తెలిపారు.

ఇకపోతే తమిళంలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మణిరత్నం గారు ఈ సినిమా గురించి ఎన్నోసార్లు తన దగ్గర ప్రస్తావించారని ఎట్టకేలకు ఆయన కల నెరవేరింది సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాకుండా చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇక డైరెక్టర్ మణిరత్నంతో తనకెంతో అనుబంధం ఉందని గీతాంజలి సినిమా సమయంలో ఈయనతో కలిసి చేసిన ప్రతి ఒక్క క్షణం తనకు ఎంతో మధుర జ్ఞాపకం అంటూ ఈ సందర్భంగా నాగార్జున మణిరత్నం గురించి మాట్లాడుతూ ప్రశంసలకు కురిపించారు.