“వారసుడు” లో సీనియర్ నటి సీన్స్ అన్నీ తీసేశారట.!

ఈ ఏడాది కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి భారీ హిట్ సినిమాల్లో స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన భారీ చిత్రం “వారిసు” కూడా ఒకటి. పెద్ద పోటీలో వచ్చినప్పటికీ పైగా యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమాని దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా చాలా పెద్ద తారాగణం తోనే తెరకెక్కింది.

శ్రీకాంత్, జయసుధ, రష్మికా, శరత్ కుమార్, ప్రభు సహా ఎస్ జె సూర్య లాంటి నటించారు. కాగా వీరితో పాటుగా సీనియర్ నటి ఖుష్భు కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. బహుశా తమిళ్ వెర్షన్ లో ఆమె కనిపించి ఉండొచ్చు కానీ తెలుగు లో అయితే అసలు ఆమె సీన్స్ లేనే లేవు.

కాగా ఇపుడు ఆమె సన్నివేశాలు తీసేయడంపై అయితే ఆమె లేటెస్ట్ గా మీడియాలో మాట్లాడారు. గోపీచంద్ నటించిన “రామబాణం” సినిమా మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ వారసుడు సినిమాలో నాది 18 నిమిషాల మేర కనిపించే పాత్ర ఉంటుంది అని కానీ సినిమా నిడివి కారణంగా నా సీన్స్ అన్నిటినీ కూడా సినిమాలో తీసేశారని కుష్బూ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా నా సీన్స్ ఉన్నపుడే దిల్ రాజు గారు కూడా ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వచ్చింది అని కానీ ఈ సినిమాలో తన సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేశారని ఖుష్బూ చెప్పడం వైరల్ గా మారింది. 18 నిముషాలు తీసిన సీన్ ని కొంచెం కూడా ఉంచకుండా తీసేసారు అని మాటలు కాదనే చెప్పాలి. అయితే అంత తీసినా కూడా ఈ సినిమా ఏకంగా 3 గంటలు దగ్గర ఉంటుంది. అందుకే ఆమె సీన్స్ తొలగించారు ఏమో.