ఇంకా “ఆదిపురుష్” ఎంత రాబట్టాలంటే.!

ఈ ఏడాదికి మొదటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమాగా అయితే రిలీజ్ కి వచ్చిన సినిమా “పఠాన్” కాగా ఈ సినిమా తర్వాత ఈ ఏడాది హిందీ మార్కెట్ సహా ఇతర భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమా మాత్రం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” అని చెప్పాలి.

మరి ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ ఈ చిత్రం డిజాస్టర్ గానే మిగిలిపోయింది. అయితే హిందీలో ఈ సినిమా ఓన్ రిలీజ్ పైగా ఓపెనింగ్స్ తోనే చాల వసూళ్లు వచ్చేసాయి కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా రికార్డు నష్టాలు మిగిల్చేలా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ సినిమా తెలుగులో 120 కోట్లకి పైగా బిజినెస్ ని జరపగా ఈ సినిమా ఒరిజినల్ గా ఇంకా 60 కోట్ల షేర్ కూడా రాబట్టనట్టుగా తెలుస్తుంది. దీనితో ఇంకా 60 కోట్ల మేర వసూళ్లు రాబట్టాల్సి ఉంది. దీనితో లాంగ్ రన్ లో గరిష్టంగా 10 కోట్లు వేసుకున్నా సరే 50 కోట్లు నష్టాలు తప్పవని చెప్పి తీరాలి.

కాగా తెలుగులో అయితే నష్టాలు మాత్రం తప్పవని ఇపుడు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఫైనల్ షేర్ ఎంతవరకు వస్తుందో చూడాలి. కాగా ఈ భారీ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ తదితరులు నటించగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలాగే టి సిరీస్ అనే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.