Chiranjeevi – Pawan Kalyan: అప్పట్లో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయని, ఆ తర్వాత పార్టీని చిరంజీవి గారు సరైన వర్కింగ్ ఆర్డర్లో పెట్టలేకపోయారని నిర్మాత అంబికా కృష్ణ అన్నారు. దానికి కారణం ఆయనకు సమయం లేకపోవడమా లేదంటే ఇంట్రస్ట్ లేకపోవడమా అనేది పక్కన పెడితే, ఓవరావల్గా ఆయనకు కంటిన్యుటీ లేకపోవడం అనేది మాత్రం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అదే గనకు అప్పుడు కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు చాలా స్ట్రాంగ్గా ఉండేదని ఆయన స్పష్టం చేశారు.
ఒక పార్టీని ముందుకు నడిపించడమనేది చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారమన్న ఆయన, చాలా మందితో ఎప్పుడూ కాంటాక్ట్లో ఉండాలని, కార్యకర్తలతో మాట్లాడడం, వాళ్లకు కావల్సినవి సమకూర్చడం లాంటివన్నీ చేయాలని, అవన్నీ చేయడంలో చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారని ఆయన తెలిపారు. కానీ అదే పవన్ కల్యాణ్ విషయానికొస్తే మాత్రం ఆయన అన్ని చోట్లా ఓడిపోయారని ఆయన అన్నారు. ఆయనకు కనీసం 20,30 సీట్లు వస్తాయని అందరూ ఊహించారన్న ఆయన, అలాంటిది అలా ఓడిపోయినా కూడా ఆయన ఇప్పటికీ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆయన చెప్పారు.
ఇప్పటికీ పవన్ కల్యాణ్ గారు ప్రజలకు టచ్లో ఉంటూ, కార్యకర్తలతో మాట్లాడుతూ యాక్టివ్గా ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన ప్రజాక్షేత్రంలో లేరన్న వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ.. ఇలాంటి సొల్లు ఎప్పుడూ చెప్తూనే ఉంటారని, సినిమాల్లో నటించొద్దని కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంపై తాను ఇంతకు ముందే స్పందించానని, అసలు ఆయన్ని సినిమాల్లో నటించొద్దని చెప్పడానికి వాళ్లెవరు అని ఆయన ప్రశ్నించారు. అలాంటి మాటలు కేవలం రాజకీయ నాయకులు తప్ప సామాన్య ప్రజలెవరూ అలా అనరని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఆయనకు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎక్కువ ఓటింగ్ వచ్చిందని ఆయన తెలిపారు.
