‘రాధే శ్యామ్’ సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్ ఒకటే ఒకెత్తు .. అందుకే 30 కోట్లు ..!

డార్లింగ్ ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్, యువి క్రియోషన్స్ బ్యానర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుండగా సీనియర్ బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తెలుగు తమిళ హిందీ మలయాళ కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందిస్తున్నారు.

Prabhas' first look from 'Radhe Shyam' out, motion poster to release on his  birthday, Entertainment News | wionews.com

కాగా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక కరోనా కారణంగా కొద్ది మంది యూనిట్ సభ్యులతో ఇటీవలే ఇటలీలో షెడ్యూల్ పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ ఇండియాకి తిరిగొచ్చారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – పూజా హెగ్డే మీద కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. ఇక దాదాపు టాకీ పార్ట్ కంప్లీటయిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇందుకోసం భారీ సెట్స్ నిర్మించారట.

Birthday Poster! Prabhas unveils Pooja Hegde's new look from 'Radhe Shyam'  | Telugu Movie News - Times of India

అయితే ఈ సెట్ కి ఖర్చు చేసిన బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సెట్ కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ సెట్ లో సినిమా క్లైమాక్స్ ని చిత్రీకరించనున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ క్లైమాక్స్ సినిమాకి చాలా ప్రాధాన్యం అని అందుకే అంత భారీ వ్యవయంతో సెట్ నిర్మించారని అంటున్నారు. ఇక్కడ జరిగే షూటింగ్ తో ‘రాధే శ్యామ్’ దాదాపు పూర్తవుతుందని తెలుస్తుంది. కాగా 2021 సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.