బిగ్ అప్డేట్ : ఏపీలో “సలార్” పంపిణీదారులు ఎవరెవరంటే..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ అంతా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్”. మరి హీరో ప్రభాస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై హైప్ పిచ్చి పీక్స్ లో ఉంది. దీనితో ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మంచి హై లెవెల్లో నడుస్తుండగా.. 

ఇక రీసెంట్ గానే సలార్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి సౌత్ ఇండియాలో ఎవరెవరికి హక్కులు వెళ్ళాయో మేకర్స్ ఒకొకటిగా రివీల్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషల్లో అయితే సినిమా బిజినెస్ ముగించుకోగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి వచ్చింది.

అలా ఇప్పుడు ఏపీలో అయితే సలార్ చిత్రం బిజినెస్ ని ముగించుకుంది. కాగా ఏపీలో ఏయే ప్రాంతాల్లో ఎవరెవరు చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారనేది చూస్తే..మొదటగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీ సిరి సాయి సినిమాస్ వారు అలాగే తూర్పుగోదావరిలో లక్ష్మీ నరసింహ శ్రీ మణికంఠ ఫిల్మ్స్ అలాగే పశ్చిమ గోదావరిలో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో కెఎస్ఎన్ టెలి ఫిలిమ్స్ ఫైనల్ గా నెల్లూరు,సీడెడ్‌లోని శ్రీ వెంగబాంబ సినిమాస్, శిల్పకళా ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

దీనితో సలార్ ఏపీ బిజినెస్ ని ముగించుకుంది. ఇక నెక్స్ట్ తెలంగాణా దిష్ట్రుబ్యూటర్ ఎవరు అనేది తెలియాలి. కాగా నైజాం లో అయితే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని దక్కించుకున్నారని అంటున్నారు. మరి దీనిపై అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. 
https://x.com/hombalefilms/status/1724756660428964338?s=20