అప్పుడు నేను విష్ చేస్తే ప్రభాస్ పట్టించుకోలేదు… ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రిషబ్ శెట్టి!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతుంది. కాంతార సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి రిషబ్ శెట్టి ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేస్తున్నారు. ఈ సినిమా ముందుగా కన్నడ చిత్ర పరిశ్రమలో విడుదలై అనంతరం పలు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకుంది.

ఈ సినిమా కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఈ సినిమా పై ఎంతో మంది రాజీకీయ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కాంతార సినిమా గురించి ప్రశంసల కురిపించిన వారిలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కూడా ఉన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రిశబ్ శెట్టి మాట్లాడుతూ…తనకు విష్ చేసిన వారిలో ప్రభాస్ కూడా ఉన్నారని తెలిపారు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ ప్రభాస్ సైతం ఆయనకు కాల్ చేసి విష్ చేశారట. ఇదే టైంలో ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినా పట్టించుకోలేదు. చాలా లైట్ తీసుకున్నారని, సినిమా గురించి మాత్రం గంటల తరబడి మాట్లాడారని తెలిపారు. అలా ప్రభాస్ మాట్లాడే సరికి కాంతార సినిమా ప్రజలకి ఎంతగా నచ్చిందో అప్పుడే అర్థమైందని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు. ఈ విధంగా ప్రభాస్ గురించి రిషబ్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.