Pawan Kalyan: మామ అల్లుళ్ళ సినిమాకి ముహూర్తం కుదిరింది…. ఆనందంలో మెగా అభిమానులు!

Pawan Kalyan: సాధారణంగా మెగా హీరోలకు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ వున్న సంగతి మనకు తెలిసిందే. మెగా హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే ప్రేక్షకులకు, అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. ఇలా ఒక్కో హీరో సినిమాకి ఎంతో సందడి చేసే మెగా అభిమానులు ఒకే ప్రేమ్ లో ఇద్దరు హీరోలు కనిపిస్తే వారి హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి మెగా హీరోలు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోని వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకి ముహూర్తం కుదిరింది తెలుస్తోంది. తమిళంలో నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన వినోదయ సితం ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రలో సందడి చేయనున్నారు. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మించనుండగా, ఈ సినిమాకు నటుడు సముద్రఖని దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే దీనికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇకపోతే ఈ సినిమా ఈ నెల 25వ తేదీ పూజా కార్యక్రమాలను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలియజేయనున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే వ్యక్తి కారు ప్రమాదంలో మరణిస్తారు.తన ఆత్మను తీసుకువెళ్లడానికి దేవదూతలు రావడంతో తాను భూలోకంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తనకు కొంత సమయం ఇస్తే ఆ పనులు చేసి తిరిగి వస్తానని చెప్పి భూలోకంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఏం చేశాడు అనే కథా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.