వారసుడి కోసం పుత్ర కామేష్టి యాగం చేసిన కృష్ణంరాజు దంపతులు.. ఫలితం మాత్రం శూన్యం!

Praseedha Uppalapati Shares Krishnam Raju Fish Curry

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరుపొందిన కృష్ణంరాజు 180 కి పైగా సినిమాలలో నటించి రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందాడు. కృష్ణంరాజు నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు గతంలో కేంద్ర మంత్రివర్గంలో పనిచేసిన కృష్ణంరాజు ప్రజలకు ఎంతో సేవ చేసి మంత్రిగా ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించాడు . దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇక కృష్ణంరాజు కుటుంబ విషయానికి వస్తే కృష్ణంరాజు మొదటి భార్య యాక్సిడెంట్ లో మృతి చెందగా రెండవసారి శ్యామలాదేవిని వివాహం చేసుకున్నాడు కృష్ణంరాజుకు నలుగురు ఆడపిల్లలు. మొదటి భార్య చనిపోయిన తర్వాత ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నాడు ఆ తర్వాత రెండవ భార్య శ్యామలాదేవికి ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అయితే పుత్ర సంతానం కోసం కృష్ణంరాజు పండితుల ఆదేశాల మేరకు పుత్ర కామేష్టి యాగం చేశాడు అయినప్పటికీ ఫలితం మాత్రం లభించలేదు.

చాలాకాలం తనకి వారసుడు లేదని బాధతో ఉన్న కృష్ణంరాజు తర్వాత తన తమ్ముడి కొడుకు ప్రభాస్ ని తన వారసుడిగా భావించి ఇండస్ట్రీలోకి పంపాడు. తండ్రి లేని ప్రభాస్ తన పెదనాన్న తండ్రిగా భావించి సొంత కొడుకు కన్నా ఎక్కువగా కృష్ణంరాజును చూసుకున్నాడు. కృష్ణంరాజు ముగ్గురు కూతుర్లకు తానే సొంత సోదరుడిలా అన్ని సమయాలలో తోడుగా నిలుస్తున్నాడు. కృష్ణంరాజు మరణించిన తర్వాత కూడా అంత్యక్రియలలో ప్రభాస్ అన్ని దగ్గరుండి చూసుకున్నాడు.