Radhe Shyam:ఆకట్టుకుంటున్న ‘ది జర్నీ ఆఫ్ రాధేశ్యామ్’…వీడియో వైరల్..!

Radhe Shyam: పాన్ ఇండియా మూవీ గా అభిమానుల ముందుకు రానున్న రాధేశ్యామ్ ఈ సినిమా మార్చి 11న విడుదల అవుతోంది. ఇంకా రెండు రోజులు సమయమే ఉండగా ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ సినిమా కు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. టి -సిరీస్, యు వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో కృష్ణం రాజు, భాగ్యశ్రీ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాహో చిత్రం తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందిరాబోతోంది.

చిత్రం విడుదలకు ఇక కొద్ది సమయమే ఉండగా రాధేశ్యామ్ టీం ప్రమోషన్స్ ను భారీగా చేస్తోంది. ముంబైలో ట్రైలర్ రిలీజ్ తో ప్రమోషన్స్ ను ప్రారంభించిన టీం, ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తున్నారు.రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొత్త వీడియోను ‘గ్లింప్సెస్ ఇన్ టు ది జెర్నీఆఫ్ రాధేశ్యామ్’ అనే పేరుతో  విడుదల చేశారు.
YouTube video player

చిత్రానికి సంబంధించిన జర్నీ ఎప్పుడు మొదలైందో చెబుతూ.. మొత్తానికి చివరి దశకు చేరుకున్నాము అని వినూత్నంగా తెలియజేశారు.బిగ్గెస్ట్ వార్ కు సాక్షులుగా చేరడానికి మాతో చేరండి అని  ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తున్నట్టు గా చేసిన వీడియో అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.