Big Boss OTT: నేడు సాయంత్రం గ్రాండ్ గా ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటీటీ… ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే!

Big Boss OTT:బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ కార్యక్రమానికి ఎంత ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లు పూర్తి చేసుకుంది.ఇలా ఐదు సీజన్లు పూర్తి అయిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈసారి బుల్లితెరపై కాకుండా డిజిటల్ మీడియాలో విడుదల చేయాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ కార్యక్రమం ఎంతో గ్రాండ్ గా ప్రారంభం కానుంది.

ఎనభై రెండు రోజుల పాటు 24 గంటలు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ల గురించి పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కూడా పాల్గొంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం ద్వారా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే విషయం గురించి ఎంతో ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలోని నేడు ఈ కార్యక్రమం ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ఫైనల్ కంటెస్టెంట్ లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఆ కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. యాంకర్ స్రవంతి, యాంకర్ శివ, ముమైత్ ఖాన్, ఆర్జే చైతూ ఈ ఐదుగురు స్టార్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అషు రెడ్డి, మహేష్ విట్టా, అరియానా, అఖిల్ సార్థక్, హమీద, సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, మోడల్ అనిల్ రాథోడ్, నటి, మోడల్ మిత్ర శర్మ, శ్రీరాపాక, బిందు మాధవి, తేజస్వి మదివాడ, రోల్ రైడా వంటి వారు పాల్గొంటున్నారని తెలుస్తుంది.