Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌కు మరోసారి హత్య బెదిరింపులు.. ఐసిస్ కశ్మీర్ నుంచి షాక్ మెయిల్స్

Gautam Gambhir: టీమిండియా ప్రధాన కోచ్‌, మాజీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ మరోసారి హత్య బెదిరింపులకు గురయ్యారు. ఐసిస్‌ కశ్మీర్ అనే సంస్థ నుంచి ఈ నెల 22న రెండు ఈ-మెయిల్స్ వచ్చాయని, తనను చంపుతామంటూ అందులో బెదిరింపులు ఉన్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. “ఐ కిల్‌ యూ” అనే పేరుతో వచ్చిన మెయిల్స్‌ కారణంగా గంభీర్ తన భద్రత విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు గంభీర్ దర్యాప్తు కోరుతూ ఫిర్యాదు చేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించాలని కోరారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర పోలీసు దళాల సహకారంతో దాడుల వ్యూహాలు, బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్న వర్గాలను గమ్యంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది మొదటి సారి కాదు. 2021లో కూడా గంభీర్‌కు ఇలాంటి ఈ-మెయిల్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా ఐసిస్‌ కశ్మీర్‌ పేరుతో ఆయనకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్పటి నుంచి గంభీర్ భద్రత పెంచబడినట్టు సమాచారం. ఈసారి కూడా అలాగే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై గంభీర్ తాజాగా తీవ్రంగా స్పందించారు. “మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ దారుణానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్ష తప్పదు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది,” అంటూ గంభీర్ ట్వీట్ చేశారు. దాడికి గంభీర్ స్పందించిన తర్వాతే మెయిల్స్ రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తంగా మారాయి.

ఎక్కడున్నావ్ పవన్ || Analyst Ks Prasad EXPOSED Pawan Kalyan Over Pitapuram Dalit Issue || TR