Mahesh Babu: మహేష్ విలన్ గా తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్…. ఇందులో నిజమెంత?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాలను లైన్ లో పెట్టేసాడు.అయితే ఇప్పుడోక ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో సినిమాలో తమిళ టాప్ హీరో చియాన్ విక్రమ్ ను ఒక కీలక రోల్ కోసం తీసుకుంటున్నట్టు సమాచారం.త్రివిక్రమ్ ఇంతకుముందు సన్ అఫ్ సత్యమూర్తి కోసం కన్నడ హీరో ఉపేంద్రను ఎంచుకున్నారు అలాగే ఇపుడు ట్రై చేస్తున్నట్టుంది.

అయితే అధికారికంగా ఇంకా ప్రకటించలేదు పైగా విక్రమ్ ఆఫీస్ నుండి మహేష్ తో సినిమా పై ఎలాంటి చర్చ జరగలేదని రూమర్స్ మాత్రమేనని చెబుతున్నారు.
అయితే విక్రమ్ 2018 లో కదరామ్ కొండన్ సినిమాలో సహాయక పాత్ర చేసారు. ఇక విలన్ గా చివరి సారి రావన్ సినిమాలో కన్పించారు. ఇక ఇపుడు మహేష్, విక్రమ్ కాంబినేషన్ సెట్ అయితే SSMB@28 కచ్చితంగా పాన్ ఇండియా సినిమాగా నిలుస్తుంది. ఇద్దరు సౌత్ సూపర్ స్టార్స్ ఇందులో ఉండటమే కారణం.

ఇక చియాన్ విక్రమ్ తన తమిళ సినిమాలతో ఎంతో బిజీ గా ఉన్నారు. కోబ్రా, పోనియన్ సెల్వం సినిమాలను పూర్తి చేసి తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. 61 వ సినిమాను పా రంజిత్ డైరెక్షన్ లో చేయనున్నారు. గ్రీన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు అయితే మిగతా నటీనటులు టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మహేష్ బాబు కూడా సర్కారీ వారి పాట పూర్తి కాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బిజీ కానున్నారు.