తండ్రి సినిమాలో కూతురు ఎంట్రీ!?

జనవరిలో ‘పఠాన్‌’, తాజాగా ‘జవాన్‌’ చిత్రంతో బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ . ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన సుహానా ఖాన్‌తో కలిసి ఓ థ్రిల్లర్‌ చిత్రంలో నటిస్తునట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతోంది.

ఇంకా టైటిల్‌ ఖరారు చేయని సుజోయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్నారు. షారుక్‌, సుహానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వచ్చే ఏడాది నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పనులు స్క్రిప్ట్‌ దశలో ఉంది.

రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకి యాక్షన్‌ సన్నివేశాలను దాదాపు 6 నెలలపాటు విదేశాల్లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షారుక్‌ ‘డంకీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.