కాంతార సినిమా కోసం నాన్ వెజ్ తినడం మానేశా: రిషబ్ శెట్టి

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30 తేదీ కన్నడ భాషలో విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని పలు భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రిషబ్ శెట్టి ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ తాను సినిమాలలోకి రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పెద్ద ఎత్తున అప్పులు చేశానని, అప్పులు ఇచ్చిన వారి నుంచి తప్పించుకోవడం కోసం మారువేశాలలో తిరగానని ఈయన తెలిపారు.ఇలా ఎన్నో విషయాలను వెల్లడించిన ఈయన కాంతార సినిమాని హిందీలో రీమేక్ చేస్తారా అంటూ ప్రశ్నించగా అలాంటి ఆలోచనలు లేవని సమాధానం చెప్పారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఎంతోమంది అభిమాన హీరోలు ఉన్నప్పటికీ ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయనని తెలిపారు.ఈ సినిమా చేయాలంటే మూలాలు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసి ఉండాలి, వాటిని విశ్వసించే వారు కావాలని తెలిపారు. ఇక ఈ సినిమాలో తాను దైవ్ కోలా సీక్వెన్స్ చేసే సమయంలో సుమారు 60 కిలోల బరువును మోయాల్సి వచ్చిందని తెలిపారు అయితే దైవ్ కోలా సీక్వెన్స్ చేసే సమయంలో సుమారు 30 రోజుల పాటు తాను ఎలాంటి నాన్ వెజ్ కూడా ముట్టుకోలేదని తెలియజేశారు.ఈ సీక్వెన్స్ చేసే సమయంలో కేవలం ప్రసాదం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతూ షూటింగ్లో పాల్గొన్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.