కొత్తింట్లో శ్రీముఖి సంద‌డి.. సోష‌ల్ మీడియాలో ఫొటోల‌తో ర‌చ్చ చేస్తున్న లౌడ్‌స్పీక‌ర్

గొంతులో స్పీక‌ర్ పెట్టిన‌ట్టే గ‌ల‌గ‌ల మాట్లాడే శ్రీముఖి ఎంతో మంది ప్రేమాభిమానాలు సంపాదించుకుంది. చూడ‌టానికి ప‌క్కింటి అమ్మాయిలా ఉండే ఈ ముద్దుగుమ్మ‌ని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ప‌టాస్ షోతో ఫుల్ ఫాంలోకి వ‌చ్చిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత అనేక షోల‌ని సింగిల్ హ్యాండ్‌తో హోస్ట్ చేస్తూ త‌న‌కు తిరుగులేద‌ని అనిపించుకుంది. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పార్టిసిపేట్ చేసిన శ్రీముఖి చివరి వ‌ర‌కు పోరాడి ర‌న్న‌ర్‌గా నిలిచింది. ఒకానొక ద‌శ‌లో ఈమెనే విజేత అవుతుంద‌ని అంద‌రు అనుకున్న‌ప్పటికీ, చివ‌రికి లెక్క‌లు తారుమారు కావ‌డంతో ర‌న్న‌ర్‌గా అడ్జెస్ట్ కావ‌ల‌సి వ‌చ్చింది.

ఇక ఇటీవ‌ల న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని ‘400 మంది అత్యంత ప్రభావవంతులు’ జాబితాలో శ్రీముఖి చోటు ద‌క్కించుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఈ అమ్మ‌డు నిజామాబాద్‌లో సొంతిల్లు నిర్మించుకోగా, రీసెంట్‌గా ఇంటి పూజా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంది. ఇల్లు ఇంకా పూర్తికాక‌పోయిన మే వ‌ర‌కు సరైన ముహూర్తాలు లేకపోవడంతో ఈ గురువారం గృహ ప్రవేశానికి శుభ ముహూర్తం అని త‌న‌ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది శ్రీముఖి.

కొత్త ఇల్లు క‌డుతున్న శ్రీముఖికి నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ అమ్మడు ప్ర‌స్తుతం క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేస్తుండ‌గా, స‌త్తిబాబు చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మనో, రాజారవీంద్ర, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్‌ నిర్మిస్తున్నారు. ‘హాస్యప్రధానంగా సాగుతున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదిని అలరించే వినోదభరిత చిత్రంగా ఉంటుంద‌ట‌. ఇందులో శ్రీముఖి న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ని పోషిస్తుంది. పోసాని కృష్ణ ముర‌ళి యోగా టీచ‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంతో న‌టిగా మ‌రోసారి తాను ప్రూవ్ చేసుకోవాల‌ని శ్రీముఖి ఆరాట‌ప‌డుతుంది.