అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత.. ఇకపై ప్రత్యేక రచ్చరచ్చే!

సింగర్ సునీత పరిచయం అవసరం లేనిపేరు గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే పాట ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె తన మొదటి పాటతోనే ఎంతోమందిని ఆకట్టుకుని ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెబుతూ మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే సునీత ఇన్ని రోజులపాటు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని జీవితంతో పోరాటం చేశారు.

ఎప్పుడైతే ఈమె రెండవ వివాహం చేసుకున్నారో అప్పటినుంచి తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉందని చెప్పాలి.ఇలా తన స్నేహితుడిని రెండవ వివాహం చేసుకున్న సునీత వివాహమైన కొద్ది రోజులపాటు పెద్ద ఎత్తున నేటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం ఈమె తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడంతో ఎంతో మంది అభిమానులు సైతం తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ కామెంట్లు చేశారు.

ఈ విధంగా సునీత ఇండస్ట్రీలో కొనసాగుతూ మరోవైపు పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే రెండవ వివాహం అనంతరం సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంది.సోషల్ మీడియా వేదికగా ఈమె ఎలాంటి పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.ఈ క్రమంలోనే తన ఇన్స్టాగ్రామ్ అభిమానులకు శుభవార్త అంటూ ఒక వీడియోని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలో భాగంగా తాను ఇంస్టాగ్రామ్ లో వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలను చేయబోతున్నానని తెలిపారు. ఇప్పటికే తాను ఒక వీడియో చేశానని అయితే ప్రస్తుతం అది వర్కింగ్ లో ఉందని ఇకపై తాను కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా అభిమానులను సందడి చేయడానికి సిద్ధమయ్యానని ఈమె వెల్లడించారు.