యువ గాయని హారికా నారాయణ్‌ వివాహం .. ప్రియుడు పృథ్వీనాథ్‌తో ఏడడుగుల బంధం!

యువ గాయని హారికా నారాయణ్‌ వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు పృథ్వీనాథ్‌తో ఆమె ఏడడుగులు వేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకలో సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, కోటితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

నూతన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువే హారికా నారాయణ్‌. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని కలలు కన్న ఆమె అనుకోనివిధంగా సింగర్‌ అయ్యారు.

తన గానంతో యువతను ఉర్రుతలూగించారు. ‘ఆచార్య’ సినిమాలోని ‘లాహే లాహే’, ‘సర్కారు వారి పాట’ టైటిల్‌ ట్రాక్‌ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. నిశ్చితార్థం అనంతరం పృథ్వీనాథ్‌ను పరిచయం చేస్తూ ఇటీవల ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘అందమైన స్నేహం.. ప్రేమ.. ఏడేళ్ల ప్రయాణమిది. నీతో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా‘ అని ఆమె రాసుకొచ్చారు.