ప్రభాస్ 21 లో సింగీతం శ్రీనివాస రావు:వైజయంతీ మూవీస్

Singeetam Srinivasa Rao as mentor to Prabhas

ప్రముఖ దర్శకుడు, నటుడు సింగీతం శ్రీనివాస రావు 89 వ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ 21 సినిమాలో ప్రభాస్ గురువుగా ఎంపికైనట్లు వైజయంతి మూవీస్ ప్రకటించింది.

Singeetam Srinivasa Rao as mentor to Prabhas
ప్రభాస్ 21 లో సింగీతం శ్రీనివాస రావు:వైజయంతీ మూవీస్

సింగీతం పుట్టినరోజు పోస్టర్‌ను పంచుకుంటూ, ప్రభాస్ 21 చిత్రం యొక్క ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ ట్విట్టర్‌లో, “చాలా కాలంగా ఎదురుచూస్తున్న కల చివరకు నెరవేరుతుంది. సింగీతం శ్రీనివాస రావు గారు మా ఇతిహాసములో భాగమవుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అతని సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మనకు మార్గదర్శక శక్తిగా ఉంటాయి. ”

దక్షిణాదిన సింగీతం చేసినన్ని ప్రయోగాలు మరే దర్శకుడూ చేసి ఉండడంటే ఆశ్చర్యం లేదు. అందరూ ఒక మూసలో కొట్టుకుపోతున్న సమయంలో పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి వినూత్న చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారాయన.ఇదిలా ఉండగా.. సింగీతం ఈ నెల 9న కరోనా పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ కోలుకుంటున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ప్రభాస్ 21వ చిత్రం మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా అశ్విని దత్ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే తెలుగులో తెరంగేట్రం చేస్తుంది.వైజయంతీ మూవీస్ నిర్మించబోయే ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్లో ఉండబోతుంది. ఈ మూవీ డిసెంబర్ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉందని, 2023 లో ఈ చిత్రాన్ని పలు ప్రాంతీయ, విదేశీ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.