ప్రభాస్ సరసన శృతిహాసన్ .. క్లారిటీ ఇచ్చిన సలార్ చిత్ర యూనిట్ !

లోకనాయకుడు కుమార్తె , స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన శృతిహాసన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివర్లో ఉంది. ఈ సమయంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

 

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఆ హీరోయిన్ అంటూ ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా చిత్ర యూనిట్ ఆ వార్తలకి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ , ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తుంది అంటూ చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది. ప్రభాస్-శృతిహాసన్ కలిసి ఇప్పటివరకు సినిమా చేయలేదు. కాబట్టి స్క్రీన్ పై వీళ్లిద్దరి పెయిర్ ఫ్రెష్ గా ఉంటుందని దర్శకుడు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికితోడు ఈ పాత్రను శృతిహాసన్ ఇప్పటివరకు టచ్ చేయలేదంట. అందుకే ఆమెను తీసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఈ రోజు శృతిహాసన్ పుట్టిన రోజు సందర్భంగా శృతిహాసన్ ను సలార్ లో హీరోయిన్ గా అఫిషియల్ గా ప్రకటిస్తూ ఆమెకి బర్త్ డే విషెష్ చెప్పింది. సంక్రాంతి కి వచ్చిన క్రాక్ సినిమా స‌క్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది అందాల సొగ‌స‌రి శృతిహాస‌న్‌. క్రాక్‌లో శృతిహాస‌న్ యాక్టింగ్ ను అంద‌రూ ఫిదా అవుతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది.