సీనియర్ హీరో రాజేష్ ఆయన కుమారులు ఇద్దరు ఎలా మరణించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ హీరో రాజేష్ ఈతరం వారికి తెలియకపోయినా ఈయన కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ అందరికీ సుపరిచితమే.హీరో రాజేష్ వారసురాలిగా ఐశ్వర్య రాజేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే హీరో రాజేష్ అక్క కమెడియన్ శ్రీలక్ష్మి అనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన సోదరుడు రాజేష్ ఆయన కుమారులు ఇద్దరు మరణించిన విషయాన్ని తెలియజేశారు.

రాజేష్ ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే పూర్తిగా అనారోగ్యం పాడవడంతో తను మృతి చెందారని శ్రీ లక్ష్మీ వెల్లడించారు.ఇకపోతే రాజేష్ ఇద్దరు కుమారులు కూడా 20 సంవత్సరాల వయసులో మరణించారని శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు.రాజేష్ పెద్ద కుమారుడు మరొక అమ్మాయితో కలిసి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటికీ తెలియవు అంటూ శ్రీ లక్ష్మీ పేర్కొన్నారు. ఇకపోతే మరొక కుమారుడు సైతం 20 సంవత్సరాల వయసులో వేగంగా బండి నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై మరణించారని ఈమె తెలిపారు.

ఈ విధంగా ఐశ్వర్య రాజేష్ చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రిని ఇద్దరు అన్నయ్యలను కోల్పోయి జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని శ్రీలక్ష్మి తెలియజేశారు.ఇలా మగదిక్కు లేని ఆ కుటుంబంలో ఎంతో ధైర్యంగా పెరిగిన ఐశ్వర్య ఎవరి అండదండలు లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుందని ఈ సందర్భంగా శ్రీలక్ష్మి ఐశ్వర్య రాజేష్ కుటుంబం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.