సలార్ స్టోరీ ‘ కాపీ ‘ అంటూ తీవ్ర ఆరోపణలు , షాకింగ్ రిప్లయ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.

సలార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. రీసెంట్ గా రాధే శ్యాం సినిమా షూటింగ్ కంప్లీట్ కావడం తో బ్యాక్ టు బ్యాక్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో సెట్స్ మీదకి వచ్చాడు ప్రభాస్. ఈ సినిమాలలో ముందు సలార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సలార్ స్టోరీ మీద రక రకాల వార్తలు వస్తున్నాయి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ రామగుండంలో మొదలవగా ఈ షెడ్యూల్ 10 రోజులు నిర్వహిస్తున్నారు. దాదాపు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావస్తుందని సమాచారం.

అయితే సలార్ సినిమాని ప్రకటించినప్పటి నుండి కూడా కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ ఉగ్రం కి రీమేక్ గా తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. అంతేకాదు సలార్ ఉగ్రం సీక్వెల్ అంటూ కూడా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా మరో సినిమా రుద్ర కి రీమేక్ అన్న మాట మొదలైంది. ఈ సినిమా కంటే ఇంకా పవర్ ఫుల్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సలార్ లో చూపించబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి కూడా ఇలా అనుకోవడానికి ఛాన్స్ దొరికింది. అయితే ఇంతకు ముందే ఈ సినిమా ఏ సినిమాకి సీక్వెల్ కాని రీమేక్ కాని కాదంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.

అయినా మళ్ళీ మళ్ళీ మీడియాలో అవే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. సలార్ మూవీ ఏ హాలీవుడ్ మూవీకో లేదంటే ఇంకేదో సినిమాకు సీక్వెల్ కాని రీమేక్ కాని కాదంటూ తెల్చిపారేశాడు. ఇంత ఖచ్చితంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పినా కూడా మీడియాలో వస్తున్న వార్తలకు ఇప్పటికి అయినా ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి… అంటున్నారు. సలార్ మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వబోతుండగా.. రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక రెండవ షెడ్యూల్ లో శృతి హాసన్ జాయిన్ కాబోతుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సలార్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట.