పాన్ ఇండియా డిజాస్టర్ కి సీక్వెల్ అవసరమా?

ఈ ఏడాది ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చి భారీ డిజాస్టర్ అయ్యిన చిత్రాల్లో కన్నడ సినిమా నుంచి వచ్చి ఏదో చేస్తుంది అనుకున్న సినిమా “కబ్జా” కూడా ఒకటి. నమ్మ ఉపేంద్ర హీరోగా శ్రేయ హీరోయిన్ గా నటించిన ఈ భారీ సినిమా డిజాస్టర్ అయ్యో కూర్చుంది.

కాగా ఈ సినిమా అయితే అనుకున్న అంచనాలు అందుకోకపోగా సినిమా లాస్ట్ లో సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఫలితంతో దీనికి సీక్వెల్ ఆగిపోయినట్టే అనుకుంటే ఈరోజు చిత్ర యూనిట్ ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ఇది మాత్రం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

కాగా ఈ సినిమా అయితే మిగతా భాషల్లోనే కాకుండా కన్నడ లో కూడా హిట్ కాలేదు అలాంటి దానికి ఇప్పుడు సీక్వెల్ స్టార్ట్ చేయడం అనేది వింతగానే ఉంది. దీనితో ఈ అప్డేట్ చూసిన వారు మాత్రం బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈరోజే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

మరి ఈ మాసివ్ మల్టీ స్టారర్ లో కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ అలాగే ఇతర బిగ్ స్టార్స్ నటించగా దర్శకుడు ఆర్ చంద్రు ఈ సినిమాకి వర్క్ చేశారు. అలాగే కేజీఎఫ్ ఫేమ్ రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఆర్ చంద్రు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు.