సీక్రెట్ రివీల్ : పూజా హెగ్డే అందుకే ఇక టాలీవుడ్ సినిమాలకి సైన్ చేయడం లేదట .?

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే త్వరలో టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పబోతోందా … తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఒకసారి పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద మోజుతో టాలీవుడ్ సినిమా అవకాశాలని వదులుకొని రెండేళ్ళు ముంబై లోనే ఉండిపోయింది. కాని అనూహ్యంగా పూజా చేసిన హిందీ సినిమా మొహంజాదారో డిజాస్టర్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ కి వచ్చి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

ఈ ఏడాది అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో పూజా హెగ్డే క్రేజ్ స్కై రేంజ్ లో పెరిగిపోయింది. ఆ కారణంగానే ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జంటగా ‘రాధేశ్యామ్’ అన్న పీరియాడికల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ త్వరలో రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలవబోతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా తో పాటు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అన్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లోనూ పూజా హెగ్డే నటిస్తోంది.

Most Eligible Bachelor' Quarantine Poster: Pooja Hegde's wooing moment with  Akhil Akkineni | Telugu Movie News - Times of India

ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ ఏదీ క మిటవలేదని సమాచారం. బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన పూజా హెగ్డే బాలీవుడ్ వరసగా 3 ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సర్కస్’ అనే సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది.

రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ‘కభీ ఈద్ కభీ దివాళీ’ అనే సినిమాలో పూజా నటించనుంది. అంతేకాదు మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి జంటగా కూడా ఒక సినిమా చేస్తోందని అంటున్నారు. ప్రస్తుతం హిందీలో కమిటయిన ఈ 3 ప్రాజెక్ట్స్ వల్ల తెలుగు సినిమాలకి డేట్స్ సర్ధుబాటు చేయలేక ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదని సమాచారం. చూడాలి మరి పూజా మళ్ళీ తెలుగు సినిమా ఎప్పుడు కమిటవుతుందో.