మహేష్ ఒక్కడే అనుకుంటే.. మరో ముగ్గురు మొదలయ్యారు

maheSh babu

బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలు పోటీ పడితే ఆ కిక్కు మామూలుగా ఉండదు. అభిమానులు ఆ ఫైట్ కు ఒక రేంజ్ లో హీట్ పెంచుతుంటారు. ఇక త్వరలో అలాంటి సీన్స్ చాలానే దర్శనమివ్వనున్నట్లు అర్ధమవుతోంది. ఇటీవల గ్యాప్ లేకుండా పెద్ద సినిమాల విడుదల తేదీలని ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

2020లో ఆడియెన్స్ కోల్పోయిన సినిమా ఎంటర్టైన్మెంట్ ను అంతకు మించి అనేలా 2021 రెడీ చేస్తోంది. ఇక 2022లో కూడా అలాంటి వాతావరణమే కనిపించనుంది. సంక్రాంతి ఫెస్టివల్ కు మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోలు ఆ సిజన్ పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాతో పాటు ప్రభాస్ సలార్ అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ ముగ్గురు హీరోల మార్కెట్ వందల కోట్లల్లో ఉంటుంది కాబట్టి ఒకేసారి సెట్స్ పైకి రావడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. వీలైనంత వరకు పోటీ నుంచి ఇద్దరు తప్పుకోవాల్సిందే. మరి ఆ ఇద్దరు ఎవరో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.