‘ నన్ను చంపేయండి ‘ అంటూ కంట్లో నీళ్ళు పెట్టుకున్న స్టార్ హీరోయిన్

సంజనా గల్రానీ .. టాలీవుడ్ లో బుజ్జిగాడు సినిమాతో పరిచయం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ – త్రిష జంటగా నటించారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే త్రిష మేయిన్ హీరోయిన్ కావడం తో సంజన కి పెద్దగా క్రేజ్ రాలేదు. కాని ఈ సినిమా తర్వాత తెలుగులో అడపా దడపా కొన్ని సినిమాలు చేసింది. కాని తెలుగు సినిమాలంటే సంజనా గల్రాని కన్నడ సినిమాలే ఎక్కువ చేసింది. అంతేకాదు అక్కడ సంజనా కి ఉన్న క్రేజ్ కూడా బాగానే ఉంది.

అయితే సడన్ గా సంజనా మీద డ్రగ్స్ కేసు .. ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలో పెద్ద సంచలనం అయింది శాండల్ వుడ్ డ్రగ్స్ రాకెట్. ఈ ఉదంతంలో కొందరు సినీ ప్రముఖులు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అందులో ఒకరు నటి సంజనా గల్రానీ. రీసెంట్ గా వెలుగు చూసిన డ్రగ్ కేసులో పోలీసులు సంజనాను అరెస్టు చేశారు. సంజనా మీద ఇలా కేసు నమోదవడం ఇటు టాలీవుడ్ .. అటు శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే సంజనా మీద ఇలాంటి కేసు నమోదవుతుందని కూడా ఏ ఒక్కరు ఊహించలేదు.

కాగా ఈ మధ్యనే జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చింది సంజన. రావడంతోనే కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ అయింది. కొన్ని నెలలుగా తాను ఏడుస్తూనే ఉన్నానని.. బహుశా తన కంట్లో కన్నీళ్లు అయిపోయి ఉంటాయేమోనని పేర్కొన్నారు. ‘ఇంత కష్టపెట్టే బదులు నన్ను చంపేయొచ్చు కదా అని దేవుడ్ని ప్రార్థించా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు తనకి జరిగిన ఈ అనుభవం తో ఇకపై తనకు ఎదురయ్యే ప్రతి విషయాన్ని నవ్వుతూ ఎదుర్కొని సక్సస్ అవ్వాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. న్యాయవ్యవస్థ మీద నమ్మకం ఉందని.. అన్నింటికి సమయమే సమాధానం చెబుతుందని పేర్కొంది.