ఏపీలో “సలార్” రేట్స్ కి అన్యాయం??

రానున్న మరికొన్ని రోజుల్లో పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ మళ్ళీ బద్దలు కానుంది. ఎన్నో అంచనాలు ఉన్న బిగ్గెస్ట్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” సినిమా రిలీజ్ కి రాబోతుండగా దీనిని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం టికెట్స్ ఒకొక చోట నుంచి రిలీజ్ చేస్తున్నారు.

మరి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పట్ల మరింత ఆసక్తి నెలకొనగా ఈ బుకింగ్స్ టికెట్ ధరలు పెరిగితే తప్ప స్టార్ట్ కావడానికి లేదు. అందుకే తెలుగు మినహా అన్ని చోట్లా బుకింగ్స్ ఇపుడు మొదలయ్యాయి. అయితే ఆల్రెడీ తెలంగాణ సినిమాకి మేకర్స్ అనుకున్న హైక్స్ వచ్చాయి కానీ ఏపీలో మాత్రం సలార్ కి అన్యాయం జరిగినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.

కాగా సలార్ కి ఏపీ ప్రభుత్వం కేవలం 40 రూపాయలు మాత్రమే అదనంగా పెంచుకునే అనుమతి ఇచ్చిందట. అయితే ఇక్కడ ఆసక్తిగా ఆచార్య, సర్కారు వారి పాట లాంటి చిత్రాలకి 50 రూపాయలు హైక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం గ్లోబల్ సెన్సేషన్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ఏకంగా 75 పెంచారు.

కానీ ఇప్పుడు సలార్ కి కేవలం 40 మాత్రమే ఇవ్వడం షాకింగ్ అని చెప్పాలి. కానీ మేకర్స్ ఇంకో 10 రూపాయలు పెంచమని ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇది పెరిగితే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు. మరి ఈ మొత్తం పెరిగి బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. లాస్ట్ టైం ఏపీలో రాధే శ్యామ్ బుకింగ్స్ కు కూడా ఇదే పరిస్థితి..