థియేటర్స్ తర్వాత ఈ ఓటిటిలో “సలార్” రిలీజ్..!

బాహుబలి సినిమాలు ఇచ్చిన ఫేమ్ తో అయితే పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ నుంచి మళ్లీ ఆ రేంజ్ హిట్ అయితే రాలేదు. దీనితో ఇక బిగ్గెస్ట్ మాస్ సినిమా అయినటువంటి చిత్రం సలార్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. కాగా ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా వీరి కాంబినేషన్ పై అంచనాలు మరింత పీక్స్ లోకి వెళ్లిపోయాయి.

ఇక ఇదిలా ఉండగా ఫైనల్ గా ఇవాళ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే టాక్ అవి పక్కన పెడితే ఈ సినిమా ఓటిటి ఎవరికి ఇతర వివరాలు కన్ఫర్మ్ అయ్యిపోయాయి. కాగా ఈ సినిమాని ఓటిటిలో అయితే ఏ సంస్థ లాక్ చేసుకుందో అఫీషియల్ అయ్యింది.

కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. దీనితో ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ అనంతరం ఓటిటిలో రానుంది. కాగా ఈ సినిమా అయితే మొత్తం 8 వారాల తర్వాత మాత్రమే ఓటిటి లో వస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా దీనిపై అఫీషియల్ అప్డేట్ తర్వాత కన్ఫర్మ్ కానుంది.

కానీ ఇప్పుడికి అయితే సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృద్వి రాజ్ అలాగే జగపతి బాబు తదితరులు నటించారు. అలాగే పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.