అఫీషియల్ : నైజాంలో “సలార్” హక్కులు ఎవరికంటే.. 

పాన్ ఇండియా సినిమా ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. కాగా ఈ భారీ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా ఈ సినిమా అనుకున్న దానికంటే కూడా ఊహించని లెవెల్లో తెరకెక్కించాడని సినీ వర్గాలు చెప్తున్నాయి.

అంతే కాకుండా కేజీఎఫ్ స్టార్ యష్ పాత ఇంటర్వ్యూలు కూడా కొన్ని వైరల్ గా మారగా సలార్ పై మరింత హైప్ ఎక్కిస్తున్నాయి. కాగా ఈ చిత్రంకి సంబంధించి సౌత్ ఇండియా సినిమాలో అయితే ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులని మేకర్స్ రివీల్ చేస్తున్నారు. అలా నిన్ననే సినిమా ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ ని లాక్ చేసి అనౌన్స్ చేయగా..

ఇపుడు సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో కన్ఫర్మ్ చేశారు. మరి నైజాంలో ఈ చిత్రాన్ని అనుకున్నట్టుగానే ప్రముఖ నిర్మాణ సంస్థ టర్న్డ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి వారు సొంతం చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ వారు ఈ చిత్రానికి రికార్డు మొత్తం చెల్లించి భారీ పోటీలో ఈ సినిమాని దక్కించుకున్నారు.

మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇంకా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతి బాబు తదితరులు నటించగా ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. 
https://x.com/SalaarTheSaga/status/1725129041282498688?s=20