ఆదిపురుష్ లో రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో.. అఫీషియల్ గా రివీల్ చేసిన ప్రభాస్

saif-ali-khan-to-act-as-lankesh-in-prabhas-adipurush

ఆదిపురుష్ సినిమా ఎంత భారీ స్థాయిలో రూపొందుతున్నదో అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను అనౌన్స్ చేశాడో అప్పటి నుంచి ఆదిపురుష్ సినిమా గురించే చర్చ.

Saif ali khan to act as lankesh in prabhas adipurush
Saif ali khan to act as lankesh in prabhas adipurush

ప్రభాస్ తొలిసారిగా డైరెక్ట్ బాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. అది కూడా భారీ స్థాయి చిత్రం. ఓం రావత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రామాయణాన్ని ఆధారాంగా చేసుకొని వస్తున్నది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక.. సీతగా కియరా అద్వానీని తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరోవైపు ఈ సినిమాలో అతిముఖ్యమైన మరో క్యారెక్టర్ రావణుడి కోసం చాలామంది బాలీవుడ్ హీరోలను అనుకున్నారట. అయితే.. ఈ సినిమాలో రావణుడిది కూడా ముఖ్యమైన క్యారెక్టర్ కావడంతో దాని కోసం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారట.

Saif ali khan to act as lankesh in prabhas adipurush
Saif ali khan to act as lankesh in prabhas adipurush

ఈ విషయాన్ని ప్రభాస్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. ఆదిపురుష్ లో లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడని పోస్ట్ పెట్టారు. దానికి ఒకరోజు ముందే ఆదిపురుష్ విలన్ ను రివీల్ చేస్తున్నట్టు ప్రభాస్ పోస్ట్ పెట్టాడు. 7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివిమంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడెవరో తెలుసుకోవాలంటే రేపటి దాగా ఆగాల్సిందే.. అంటూ ప్రభాస్ పోస్ట్ చేశాడు.

అయితే.. ప్రభాస్ ఈ సినిమాను అనౌన్స్ చేసిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ నే రావణుడిగా తీసుకుంటారు.. అనే టాక్ నడిచింది. కాకపోతే అఫీషియల్ గా మూవీ యూనిట్ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ప్రభాసే ఏకంగా విలన్ రోల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

ఓం రావత్ దర్శకత్వం వహించిన తానాజీ సినిమాలోనూ సైఫ్ అలీ ఖాన్ విలన్ గానే నటించాడు. ఆ సినిమాలో విలన్ గా అందరి మన్ననలను సైఫ్ అలీ ఖాన్ అందుకున్నాడు. అందుకే ఆదిపురుష్ కు కూడా సైఫ్ నే విలన్ గా ఎంచుకొని ఉంటారు.

ఇక.. ఆదిపురుష్ సినిమా 3డీలో తెరకెక్కనుంది. ఏకకాలంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందనున్న ఈ సినిమా.. మిగితా సౌత్ భాషల్లో డబ్ కానుంది. 2021లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. 2022లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక.. ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఆదిపురుష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.