డాన్స్ రియాలిటీ షోల పై షాకింగ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి?

ఫిదా సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం. మొదటి సినిమాలో తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సాయి పల్లవి… ఆ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా తమిళ్ భాషలో కూడా స్టార్ హీరోల సరసన నటించి లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు పొందింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం ఒకే ఒక సినిమా ఉంది.

ఇదిలా ఉండగా అందానికన్నా నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ గ్లామర్ షోకు దూరంగా ఉండే సాయి పల్లవి వైవిధ్యమైన పాత్రలలో మాత్రమే నటిస్తూ వస్తోంది. ఇటీవల విడుదలైన విరాటపర్వం, గార్గి సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇక విరాటపర్వం సినిమా ప్రమోషన్ల సమయంలో కాశ్మీర్ ఫైల్స్ గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి ఆమెను వివాదాలలోకి నెట్టేసాయి. డాన్స్ షో ద్వారా డాన్సర్ గా వెలుగులోకి వచ్చిన సాయి పల్లవి.. తాజాగా డాన్స్ రియాలిటీ షో లపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి మరొకసారి వార్తల్లో నిలిచింది.

అసలు విషయం ఏమిటంటే… ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి టెలివిజన్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో సాయి పల్లవి మాట్లాడుతు..టెలివిజన్ ఛానల్స్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ప్రముఖుల వారసులకే మర్యాదలు, గౌరవాలు అన్ని దక్కుతాయి. డబ్బు ఉంటేనే టాలెంట్ ఉన్న వారికి ఇక్కడ గుర్తింపు లభిస్తుంది. అందుకే నాకు డాన్స్ రియాలిటీ షోస్ పై నమ్మకం లేదు. ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పోటీలు అంటే నాకు అసహ్యం… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. గతంలో డాన్స్ రియాల్టీ షోలో పాల్గొని పోటీ పడిన సాయి పల్లవి ఆ షో లో రన్నర్ గా నిలిచింది. బహుశా ఈ ఫలితం సాయి పల్లవిని అసహనానికి గురిచేసి ఉండవచ్చు.