“పుష్ప 2” లో సాయి పల్లవి..తేలిపోయింది.!

pushpa250622_2

నిన్న రాత్రి నుంచి కూడా టాలీవుడ్ మరియు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ ఉన్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. పార్ట్ 2 కి ప్లాన్ చేసిన వాటిలో టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి కూడా ఆన్ బోర్డు అంటూ కొన్ని గాసిప్స్ విచ్చలవిడిగా బయటకి వచ్చాయి.

అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ గాసిప్స్ పై కొన్ని ట్రస్టడ్ సోర్స్ నుంచి అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి ఉందన్న వార్త అవాస్తవం అట. దీనితో అయితే పెద్ద ఎత్తున వైరల్ గా మరీనా ఈ అప్డేట్ లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది అని చెప్పాలి. అయితే సాయి పల్లవి అల్లు అర్జున్ సినిమాలో అనే మాట చాలా మంది లో ఆసక్తి నెలకొల్పింది.

కానీ ఫైనల్ గా ఈ కాంబో పై డిజప్పాయింటింగ్ వార్తే వినక తప్పలేదు. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా సమంత అయితే కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని రూమర్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా ఈ మార్చ్ లో అయితే బన్నీ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ రానుంది అలాగే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.