సాయి ధరమ్ తేజ్‌తో సంయుక్త ఇంకోస్సారి.!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, మలయాళ కుట్టి సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

దాంతో, ఈ పెయిర్ ఇంకోసారి సెట్ అయ్యే అవకాశాలున్నట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్స సమాచారం. అయితే, ఇది ‘విరూపాక్ష’కు సీక్వెల్ అయ్యుంటుంది అని కొందరంటున్నారు.

కానీ, సీక్వెల్ కాదట. ఓ రెగ్యులర్ కమర్షియల్ మూవీ కోసం ఈ జంట ఇంకోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటోందట. ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించబోయే సినిమాలో ఈ జంట ఇంకోసారి కనువిందు చేయబోతోందట.

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని రూపొందించబోతోందనీ తెలుస్తోంది. ‘విరూపాక్ష’ సినిమాతో ఇటు తేజు, అటు సంయుక్త మీనన్ ఇద్దరూ పర్‌ఫామెన్స్ పరంగా మంచి మార్కులేయించుకున్నారు. సినిమా కూడా మంచి వసూళ్లతో విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.